నాగార్జునసాగర్‌ బీజేపీ అభ్యర్థిగా రాములమ్మ?

శనివారం, 23 జనవరి 2021 (10:15 IST)
నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిగా సినీనటి, రాములమ్మ విజయశాంతి పేరును బీజేపీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఆమె అభ్యర్థిత్వంపై నల్లగొండ జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేశారు.

సినీగ్లామర్‌తో పాటు కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడుతున్న తీరు పార్టీకి కలిసొస్తుందని వారు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై ప్రత్యేకంగా ఒక అంతర్గత సర్వే నిర్వహిస్తున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.

గత ఏడాది డిసెంబరు 7న విజయశాంతి తిరిగి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె అభ్యర్థిత్వంపై క్షేత్రస్థాయి నాయకులు, కేడర్‌ రాష్ట్ర పార్టీకి నివేదించడం ఆసక్తికరంగా మారింది.

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments