అత్తింటి వేధింపులు.. మనస్తాపంతో పురుగుల మందు సేవించి..?

శనివారం, 10 అక్టోబరు 2020 (09:54 IST)
అత్తింటి వేధింపులకు ఓ యువతి బలైపోయింది. ఈ ఘటన జిల్లాలోని మోత్కూరు మండలం దత్తప్ప గూడెంలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతో నవిత(22) అనే యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన నవిత, పరశురాములు ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఎంగేజ్మెంట్ ముందు రోజే పరుషరాములుతో నవిత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆపై మార్చి4న ఆర్య సమాజ్‌లో ఇరువురు వివాహం చేసుకున్నారు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. 
 
ఈ క్రమంలో వారిని మంచిగా చూసుకుంటామంటూ పరుశరాములు కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పి జంటను తీసుకెళ్లారు. అయితే గత కొద్దిరోజులుగా ఆదనపు కట్నం కోసం నవితను అత్తింటి వారు వేధింపులకు గురిచేశారు. 
 
రోజు రోజుకు వేధింపులు అధికమవడంతో తీవ్రమనస్తాపానికి గురైన నవిత రెండు రోజుల క్రితం పురుగుల మందు సేవించింది. పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవిత మృతి చెందింది. ఈ ఘటలనకు సంబంధించి 8 మంది కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో వున్న అత్తింటివారిని గాలించే పనిలో పడ్డారు పోలీసులు 

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments