విడుదల కానున్న 'ఓ మనిషి కథ'
జగపతిబాబు, కళ్యాణి హీరోహీరోయిన్లుగా ఓం శివ్ ఫిలిమ్స్ బ్యానర్పై బాలా భాయ్ చొవాటియా నిర్మాతగా రాధాస్వామి అవుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓ మనిషి కథ' సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 19 విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ''మనిషిలోని ముఖ్యంగా మూడు గుణాలుంటాయి. అవి ఎంత శాతం ఉంటాయనే దాన్ని బట్టి మనిషి ఎలాంటివాడో నిర్ణయిస్తాం. ఈ విషయాన్ని డ్రెమటిక్గా చెప్పాలనుకుని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. నిర్మాతగారి సహకారం మరువలేనిది. సినిమా సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని మెచ్చుకున్నారు. సినిమాని ఈ డిసెంబర్19న అత్యధిక థియేటర్స్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. జగపతిబాబుగారి నటన, విజయ్ కురాకుల సంగీతం సినిమాకి ప్లస్ అవుతాయి. డిఫెరెంట్ పాయింట్ను కమర్షియల్ హంగులు జోడించి తీసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.