Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల కృష్ణ పారితోషికం త‌గ్గించుకున్నారా!

Written By డీవీ
Updated: బుధవారం, 24 నవంబరు 2021 (16:50 IST)
Bala krishna
నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలంటే హెవీ బ‌డ్జెట్‌తో కూడుకున్న‌వే. ద‌ర్శ‌కుడు క‌థ స్థాయిని మించి ఖ‌ర్చు పెట్టిస్తుంటాడు. నిర్మాత‌లు కూడా అదే స్థాయిలో వెచ్చిస్తుంటారు. బాల‌కృష్ణ రెమ్య‌న‌రేష‌న్ ఒక‌సారి ఫిక్స్ అయ్యాక చెప్పిన‌ట్లు ఇవ్వాల్సిందే. ఏమాత్రం తేడా వ‌చ్చినా అంతే సంగ‌తులు. నిక్క‌చ్చిగా వుండే బాల‌కృష్ణ అంతే నిక్క‌చ్చిగానే ముందుగా మాట్లాడే విధానం బ‌ట్టి ప్ర‌వ‌ర్తన వుంటుంది.
 
అయితే అఖండ సినిమాకు అందుకు మిన‌హాయింపు ఇచ్చాడ‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ చిత్రం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను లావిష్‌గా ఖ‌ర్చుపెట్టించారు. ఔట్‌పుట్ బాగుంటేనే ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకుంటారు. అరుణాచ‌లం లోని ప్ర‌ముఖ దేవాల‌యంలో షూటింగ్ చేయాల్సివుంది. అప్పుడే దేవాదాయ శాఖ మంత్రినిగా ఛార్జ్ తీసుకున్న మంత్రితో బాల‌కృష్ణ మాట్లాడి ప‌ర్మిష‌న్ ఇప్పించారు.
 
అఘోరా కు చెందిన ప‌లు స‌న్నివేశాలు అక్క‌డ అద్భుతంగా తీశారు. ఇదిలా వుండ‌గా, క‌రోనా స‌మ‌యంలో రెండుసార్లు వాయిదా ప‌డ‌డంతో షూటింగ్ జాప్యం జ‌ర‌గ‌డంతో నిర్మాత‌ మిర్యాల ర‌వీంద్ర రెడ్డికు ఆర్థికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. దాంతో బాల‌కృష్ణ వాస్త‌వాన్ని తెలుసుకుని త‌న రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుని చేశాడ‌ట‌. ఇందుకు నిర్మాత చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. ఈ విష‌యాన్ని త‌న స‌న్నిహితుల‌వ‌ద్ద ఆయ‌న వెల్ల‌డించారు.
 
సో. ఏదిఏమైనా బాల‌కృష్ణ ప్ర‌స్తుత ప‌రిస్థితి చూసి రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవ‌డం విశేష‌మే. ఇటీవ‌లే పారితోషికాల విష‌యంతోపాటు ప‌లు స‌మ‌స్య‌ల గురించి అగ్ర నిర్మాత‌లు ఫిలింఛాంబ‌ర్‌లో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య విష‌యంతెలుగులోకి రావ‌డంతో వారంతా స‌మావేశంలో క‌ర‌తాళ‌ద్వ‌నులు చేశార‌ని తెలిసింది.

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?

సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్‌

తర్వాతి కథనం
Show comments