ప్రొడ్యూసరే విలన్ అయితే?.. అదే కిక్ 2 ట్విస్ట్...
నిర్మాతలు ఆర్టిస్టుగా తమ సినిమాల్లో కన్పించడం మామూలే. కానీ పేరు పొందిన నటుడు నిర్మాత కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ట్రెండ్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా 'ఓం' నే 3డి సినిమాను తీసి చేతులు కాల్చుకున్న తర్వాత కళ్యాణ్ రామ్ కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు. తాజాగా 'పటాస్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. హీరోగా నటిస్తున్నాడు. అయితే... రేసుగుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇందులో రవితేజ నటించనున్నారు. కిక్కు సీక్వెల్గా వుంటుందని తెలుస్తోంది. ఇందుఓ నందమూరి కళ్యాణ్ రామ్ విలన్గా నటించనున్నాడని తెలుస్తోంది. ఈ విషయంలో దర్శకుడు క్లారిటీ ఇవ్వకపోయినా... ప్రస్తుతం స్క్రిప్ట్వర్క్ను హైదరాబాద్లోనే తన కార్యాలయంలో చేసుకుంటున్నాడు.
అయితే.. కిక్-2గా పిలవడే ఈ చిత్రంలో విలన్గా కొత్తవారిని పరిచయం చేస్తున్నట్లు మాత్రం చెప్పాడు. దాంతో ఆ కొత్తవారు చిత్ర నిర్మాతేనని రూఢీ అయిందని ఫిలింనగర్లో చెప్పుకుంటున్నారు.