Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీకి షాక్ ఇచ్చిన సుకుమార్, ఏం చేశారు?

Written By శ్రీ
Updated: బుధవారం, 11 మార్చి 2020 (19:42 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా అల.. వైకుంఠపురములో సినిమాతో సంచలన విజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో సినిమా చేస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు రావడం.. ఆ రెండు సినిమాలు విజయం సాధించడంతో మూడవ సినిమాగా రానున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ఈ భారీ క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అల.. వైకుంఠపురములో సినిమా షూటింగ్‌లో ఉండగానే... సుకుమార్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు.
 
ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్‌ను మార్చి 15 నుంచి కేరళలో స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ఫస్ట్ షెడ్యూల్లో బన్నీ లేకుండా కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఇప్పుడు ఆ సీన్స్ సరిగా రాకపోవడంతో తీసేసారని.. ఈ విషయం తెలిసి బన్నీ ఆలోచనలో పడ్డారని... మళ్లీ ఫ్రెష్‌గా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు బన్నీ లేకుండా తీసిన సీన్స్ సినిమా కోసం కాకుండా.. ట్రైయిల్ షూట్ చేసారని.. అడవుల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఆ సీన్స్ తెర పైన ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు తీసారనేది మరో వార్త. 
 
ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను క్యూరియాసిటీని పెంచుతుందని చెప్పచ్చు. అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో బన్నీ, సుకుమార్ చాలా కేర్ తీసుకుని వర్క్ చేస్తున్నట్టు సమాచారం. 
 
సుకుమార్ మాత్రం ప్రేక్షకాభిమానులు ఎన్ని అంచనాలతో వచ్చినా.. సినిమా ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదు. ఆవిధంగా కథ, కథనంలో వైవిధ్యం ఉంటుంది. ప్రేక్షకులకు రెగ్యులర్ సినిమా కాకుండా ఓ కొత్త కథతో సినిమా చూసామనే ఫీలింగ్ కలిగిస్తుందని సుకుమార్ చెబుతున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే.. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అన్నీ చూడండి

August 28, 2026: శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

బాలికను వివస్త్రను చేసి పూజలు చేస్తే కోటీశ్వరులవుతారు: దొంగ బాబాల అఘాయిత్యం

భారీగా పడిపోయిన చికెన్ ధరలు, కారణం ఇదే

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పీఠం ఎవరిది? ప్రధాని ఎవరు? సర్వే షాకింగ్ రిజల్ట్స్

గర్భిణీగా వున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఇనుప రాడ్‌తో దాడి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?

సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్‌

తర్వాతి కథనం
Show comments