శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2024 (15:32 IST)

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున - ఆపాలని హైకోర్ట్ స్టే

Nagarjuna
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ప్రముఖ సినీనటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈక్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని హైకోర్ట్ స్టే. ఈక్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది.
 
దీనిపై నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను.
 
ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది.
 
స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది.
 
ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని.
 
తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం.
 
అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. అని నాగార్జున తెలిపారు.