సంబంధిత వార్తలు
- తండేల్ బుజ్జి తల్లి (సత్య)గా సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో
- ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్ ఆనందంలో పార్టీ చేసుకున్న అల్లు అర్జున్ !
- సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్
- షాంఘైలో స్వర్ణం నెగ్గిన భారత మహిళల కాంపౌండ్ జట్టు
- ఎల్.బి.స్టేడియంలో రామ్చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్
పిఠాపురంకు బయలుదేరిన రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి క్లయిమాక్స్కు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ప్రచారానికి తెరపడనుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్కు ప్రచారం చేయడానికి వెళ్లలేదనే టాక్ వున్నా, అందుకు క్లారిటీ ఇస్తూ, తాను రానవసరంలేదని పవన్ చెప్పారని అందుకే తాను వెళ్ళలేదని చిరంజీవి వెల్లడించారు. తాజాగా ఆయన తరపున కొడుకు రామ్ చరణ్, భార్య సురేఖ, బావమరిది అల్లు అరవింద్ నేడు పిఠాపురం బయలుదేరారు.
కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళారు. ఈ సందర్భంగా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజమండ్రిలో పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ అత్యధిక మెజార్టీతో గెలవాలనీ వారు ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు, జబర్దస్త్ నటీనటులు కూడా పవన్ కోసం ప్రచారం చేశారు.
తర్వాతి కథనం
