మంగళవారం, 24 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2016 (13:32 IST)

ధోనీ రూ.40 కోట్లు తీసుకుంటే.. మాస్టర్ సచిన్ మాత్రం పైసా కూడా తీసుకోలేదు..

ఈ మధ్య బాలీవుడ్‌లో ఒక ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల జీవితాలను వెండితెరకు ఎక్కించడం జోరుగా జరుగుతోంది. సచిన్ టెండూల్కర్, అజహరుద్దీన్ సహా పలువురు క్రీడాకారుల రియల్ లైఫ్‌ను రీల్ లైఫ్‌లోకి తీసుకువస్తున్న

ఈ మధ్య బాలీవుడ్‌లో ఒక ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల జీవితాలను వెండితెరకు ఎక్కించడం జోరుగా జరుగుతోంది. సచిన్ టెండూల్కర్, అజహరుద్దీన్ సహా పలువురు క్రీడాకారుల రియల్ లైఫ్‌ను రీల్ లైఫ్‌లోకి తీసుకువస్తున్నారు. క్రికెటర్స్‌లో సచిన్ టెండూల్కర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న, పెద్ద అందరికి సచిన్ అంటే ఇష్టం. వంద సెంచరీలు, వేలకొద్ది పరుగులు, ఆత్మవిశ్వాసం ఇవన్నీ సచిన్ సొంతం. ఈ పేరు విన‌గానే స‌గ‌టు క్రికెట్ అభిమానులకు పుల‌కింత‌ కలుగుతుంది. దేశంలో గల్లీ గ‌ల్లీకి క్రికెట్ అంటే పిచ్చ క్రేజ్ తీసుకొచ్చిన ఆట‌గాళ్ళ‌లో స‌చిన్ మొద‌టి స్థానంలో ఉండాల్సిందే. 
 
ఇలాంటి ఉన్నత గుణం ఉన్న సచిన్‌పై 'సచిన్' అనే పేరుతోనే సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ 'ధోని', 'అజారుద్దీన్'ల మీద సినిమాలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ సినిమాల‌కి, ఈ ఒక్క సినిమాకీ తేడా ఏంటంటే, ఆ సినిమాల్లో పాత్రధారులుగా వేరేవాళ్లు న‌టిస్తూ అలరిస్తున్నారు. అదే 'స‌చిన్ ఎ బిలియ‌న్ డ్రీమ్స్' లో స్వ‌యంగా స‌చిన్ టెండూల్క‌రే న‌టించడం అందరిలో ఆసక్తిని రేపుతుంది. ఇలా త‌న బ‌యోపిక్‌లో త‌నే న‌టించే అవ‌కాశం అంద‌రికీ వ‌చ్చేది కాదు. అందుకే ఈ మూవీ ద్వారా సినీ ఇండ‌స్ట్రీలోకి అరంగేట్రం చేస్తున్నాడు సచిన్ టెండూల్క‌ర్. ఇటీవలే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ రిలీజైంది. మాసిపోయిన ఒక పాత ప్యాడ్ క‌ట్టుకొని స‌చిన్ క‌నిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది.
 
మొత్తమ్మీద మైదానంలోనే కాదు వెండితెర మీద కూడా అభిమానులను అలరించేందుకు సచిన్ టెండూల్కర్ సిద్ధమయ్యాడు. నిజానికి బయోపిక్‌ను వెండితెర మీద మలిచేందుకు అనుమతించిన వారికి ఎంతో కొంత పారితోషికం ఇస్తుంటారు. ఇటీవల వచ్చిన ''ఎం.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ'' చిత్రానికి ధోని సుమారు రూ.40కోట్లు తీసుకున్నట్లు సమాచారం. కానీ.. మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన జీవితంపై సినిమా తీసేందుకు అనుమతి ఇవ్వడమే కాదు.. నటిస్తున్నందుకు పైసా పారితోషికం తీసుకోవట్లేదట. 
 
సచిన్‌ స్నేహితుడైన రవి భాగ్‌చంద్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతని వద్ద డబ్బులు తీసుకోవడం ఇష్టంలేని సచిన్‌.. పారితోషకాన్నికూడా వద్దన్నాడట. అంతేకాదు.. భారత జట్టుతో అతనికి ఉన్న అనుబంధం.. అనుభవాలను సవివరంగా చెప్పాడట. ప్రస్తుతం ధోని బయోపిక్‌ థియోటర్లలో సందడి చేస్తోంది. ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఆసక్తి.. ఉత్సాహం ఉన్నప్పుడే సచిన్‌ బయోపిక్‌ను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.