చెన్నైలో పవన్ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే.. ఆయన చెప్పింది వింటాం..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెన్నైలోని ఒక నియోజక వర్గంలో పోటీ చేసి విజయం సాధిస్తే.. ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడినా తాము వింటామని డీఎంకే తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు సవాల్ విసిరారు. మధురైలో జరిగిన మురుగ మహానాడులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు.
"అన్నా, పెరియార్, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ఎంజీర్, జయలలిత వంటి వారి గురించి కూడా తమిళనాడు బిజెపి మాజీ నాయకుడు అన్నామలై మురుగన్ భక్తుల మానాడులో మాట్లాడటంతో పాటు.. ఆయన పిలిచిన వెంటనే అన్నాడీఎంకే నేతలు వెళ్లడం బీజేపీకి బానిసలుగా మారిపోయారనేందుకు నిదర్శనమని దుయ్యబట్టారు.
మధురై మురుగన్ మహానాడు రాజకీయ వేదికగా మారిందని భక్తులు భావిస్తున్నారు. ఇదంతా ఒక రోజు బాగోతం. హిందూ సమయ నిర్వాహణ శాఖ చట్టప్రకారం జరుగుతోంది.
ఆలయాలు వుండకూడదని చెప్పట్లేదు. అది దొంగల చేతికి మారకూడదు. దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇంకా పవన్ కల్యాణ్, నాయ్నార్ నాగేంద్రన్, అన్నామలైలు మదురై మురుగన్ మానాడును రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు.