హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు మంగళవారం రాత్రి భౌతికంగా దూరమయ్యారు. ఆయన వయసు 90 యేళ్లు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్గా పని చేసేవారు.
ఆయన వృత్తిరీత్యా పలు ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడంతో తాను అనేక ప్రాంతాలు చిన్నప్పుడే తిరగాల్సి వచ్చిందని రవితేజ పలు సందర్భాలలో పంచుకున్నారు. ఇక రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు. వారిలో ఒకరు రవితేజ కాగా మరొకరు రఘు, అలాగే భరత్ రాజు. ఇక భూపతి రాజు రాజగోపాల్ రాజు స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గంపేట.
ఉద్యోగ రీత్యా ఆయన అనేక ప్రాంతాలలో పనిచేస్తూ వచ్చారు. అలా అనేక ప్రాంతాలలో పనిచేస్తూ రావడంతోనే రవితేజకు అనేక యాసలు ఒంటబట్టాయని కూడా సన్నిహితులు చెబుతూ ఉంటారు. తండ్రి మృతితో రవితేజ దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు రవితేజ నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తూ సంతాపం తెలుపుతున్నారు.