మంగళవారం, 24 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 24 జూన్ 2025 (14:10 IST)

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

crime
పెళ్లికి ముందే ప్రేమ. ఐతే పెళ్లి చేసుకునే ధైర్యం చేయకుండా పెళ్లయ్యాక అటు ప్రియుడిని వదల్లేక చివరికి కట్టుకున్న భర్తను కడతేర్చేవారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ గద్వాలలో పెళ్లై నెల రోజులు కూడా తిరక్కుండా భార్య తన భర్తను ప్రియుడి కోసం హత్య చేసింది. భర్త తేజేస్వర్ ను చంపి ప్రియుడుతో కలిసి కారులో  వేసుకుని రోడ్డుపైన తిరిగింది ఐశ్వర్య. భర్త మృతదేహాన్ని కర్నూలు శివార్లలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో పూడ్చిపెట్టాలని చూచారు. కానీ అది సాధ్యపడలేదు. తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు ముగ్గురు వ్యక్తులకు రూ. 2 లక్షలు సుపారీ ఇచ్చాడు ప్రియుడు. తేజేశ్వర్ ను చంపి ఆనవాళ్లు లేకుండా చేసాక ఇద్దరూ కలిసి కర్నాటకకు పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రణాళిక చాలా క్లిష్టమై చివరికి పోలీసులకు దొరికిపోయారు.
 
అసలేం జరిగింది?
పెళ్లయిన నెల రోజులకే భార్య తన తనతో పాటు తల్లితో సంబంధం ఉన్న ఓ బ్యాంక్‌ మేనేజర్‌తో కలిసి భర్తను హత్య చేయించింది. సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. తిరుమలరావు అనే వ్యక్తి కర్నూలులోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బ్యాంకులో చిరుద్యోగి అయిన, కల్లూరుకు చెందిన సుజాత అనే మహిళతో అతడికి అక్రమ సంబంధం ఏర్పడింది. తరుచుగా ఇంటికి వస్తుండటంతో సుజాత కూతురు ఐశ్వర్యతోనూ తిరుమలరావుకు సంబంధం ఏర్పడింది. దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసింది.
 
ఐశ్వర్యకు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్‌తో పెళ్లి నిశ్చయమైంది. తేజేశ్వర్‌ ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. తేజేశ్వర్‌తో పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ తిరుమలరావును వదులుకోవడం ఐశ్వర్యకు ఇష్టం లేదు. దీంతో పెళ్లికి ఐదు రోజుల ముందు ఫిబ్రవరి 13న ఐశ్వర్య కనిపించకుండా పోయింది. అయితే పెళ్లి ఇష్టం లేని ఆమె బ్యాంక్‌ మేనేజర్‌తో లేచిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ 16న తిరిగి వచ్చింది. పెళ్లికి ఓకే చెప్పింది. కానీ ఆమె మనసంతా తిరుమలరావు చుట్టే తిరుగుతోంది. 
 
దీంతో గంటల తరబడి అతనితో మాట్లాడుతుండేది. ఇది నచ్చని తేజేశ్వర్‌ మందలించాడు. ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అంతే తేజేశ్వర్‌ను అడ్డు తొలగించుకోవాలని తిరుమలరావుతో కలిసి స్కెచ్ వేసి పొలం కొందామని తీసుకెళ్లి కారులోనే దాడి చేసి హత్య చేశారు. ఈ క్రమంలో తేజేశ్వర్‌ కనిపించకపోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఐదు రోజులకు తేజేశ్వర్‌ మృతదేహం పోలీసులకు దొరికింది.
 
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఐశ్వర్య, సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ మేనేజర్‌ పరారీలో ఉన్నాడు. కాగా సుపారీ గ్యాంగ్‌లో కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు