మంగళవారం, 21 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
బుధవారం, 13 ఏప్రియల్ 2016 (10:40 IST)
నిజమైన ప్రేమ అనేదే ఉంటే..!
"నా మీద నీకు నిజమైన ప్రేమ అనేది ఉంటే... నేను చెప్పినట్లు చేస్తావా..?" అడిగింది శ్రీజ
"చెప్పు శ్రీజా.. నీ కోసం ప్రాణాలనైనా ఇస్తాను..!" అన్నాడు శివ
"ఏం లేదులే గానీ... ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి రాజేష్కి ఇచ్చిరాగలవా..?!".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు కనక వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు అమితాసక్తిని చూపుతున్నారు. దీంతో ఈ ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయడంతో వీటిని సొంతం చేసుకునేందుకు వాహనదారులు పోటీపడుతూ వేలం పాటల్లో పాల్గొంటున్నారు. దీంతో ఈ నంబర్లు భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఓ ఫ్యాన్సీ నంబర్ వేలం పాటల్లో గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలం పాటలో టీజీ 09, 9999 అనే అంకెలతో కూడిన ఫ్యాన్సీ నంబర్ను ఓ కంపెనీ ఏకంగా రూ.25.50 లక్షలకు సొంతం చేసుకుంది. సోనీ ట్రాన్స్పోర్టు సొల్యూషన్స్ దీనిని దక్కించుకుంది. తమ టాయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్ఎక్ కోసం ఈ భారీ మొతాన్ని వెచ్చించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వాహన ఫ్యాన్సీ నంబరు ఈ స్థాయిలో రేటు పలకడం ఇది తొలిసారి కావడం గమనార్హం.
ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు
ఈ నెల 19వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా దేశంలో ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించేందుకు ప్రవేశించినట్టు వారివద్ద జరిపిన విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా, యాదులు, హిందూ దేవాలయాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడాలన్న కృతనిశ్చయంతో వచ్చారు. ఈ నిందితులంతా శ్రీలంక జాతీయులుగా పోలీసులు గుర్తించారు. పైగా, పాకిస్థాన్లో కరుడుగట్టిన ఉగ్రవాది అబూతో టచ్లో ఉన్నట్టు తేలింది. గుజరాత్ పోలీసు శాఖకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. నిందితులను ముహమ్మద్ నుస్రత్, ముహమ్మద్ ఫారిస్, ముహమ్మద్ రస్దీన్, ముహమ్మద్ నఫ్రాన్లుగా గుర్తించారు. శ్రీలంక జాతీయులైన వీరంతా కొలంబో నుంచి చెన్నైకు వచ్చి అక్కడ నుంచి అహ్మదాబాద్కు చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వీరు వచ్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!
పల్నాడు జిల్లా ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్కు ముందు, ఆ తర్వాత ఈ జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో జిల్లా ఎస్పీగా ఉన్న బిందు మాధవ్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహించడం, విపక్ష నేతలపై అధికార నేతల దాడులను ప్రోత్సహించేలా నడుచుకున్నారన్న అభియోగాల నేపథ్యంలో ఆయనపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత జిల్లా ఎస్పీగా ఆయన స్థానంలో మలికా గార్గ్ను ఈసీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా చూడటం నా తొలి కర్తవ్యమన్నారు. ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టిస్తానని తెలిపారు.
తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!
తెలంగాణా రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. జూన్ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేసిస్తాయని పేర్కొంది. ఈ దఫా నైరుతి గమనం సానుకూలంగానే ఉందని వాతావరణ శఖ ఇప్పటికే ప్రకటించింది. తొలుత కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే ఈ రుతుపవనాలు... అక్కడ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి ఐదారు రోజుల సమయం పడుతుంది. రుతుపవనాల రాకతో జాప్యం జరిగితే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత యేడాది జూన్ 11వ తేదీన కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా, తెలంగాణ రాష్ట్రంలోకి మాత్రం 20వ నాటికి విస్తరించాయి. ఈ దఫా మాత్రం పది రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి.
బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య సేవలు స్తంభించిపోనున్నాయి. ఈ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ కింద అందించే అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సివుంది. ఈ పెండింగ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలంటూ ఈ అసోసియేషన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయించామని అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వం ఇంకా బకాయి బిల్లులను చెల్లించకపోవడాన్ని నిరసిస్తున్నట్టు అసోసియేషన్ పేర్కొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
చింతచిగురు. ఈ చింత చిగురు మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింతచిగురు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చింత ఆకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు. చింత ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది. చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది. పాలిచ్చే తల్లి చింత ఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది. బహిష్టు నొప్పి నుండి చింతాకులు ఉపశమనాన్ని అందించగలవు.
శరీరంలో యూరిక్ యాసిడ్కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..
కొన్ని ఆరోగ్య పరిస్థితులు, ఆహారం అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్కు కారణమవుతాయి. ఆల్కహాల్ను నివారించడం, కొన్ని ఆహారాలు, పానీయాలను పరిమితం చేయడం స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లను కలిగి ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడం వల్ల కలిగే సహజ వ్యర్థ ఉత్పత్తి. ప్యూరిన్లు కొన్ని ఆహారాలలో అధిక స్థాయిలో కనిపిస్తాయి. సాధారణంగా మూత్రపిండాలు.. మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ను ఫిల్టర్ చేస్తుంది.
ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట
రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పండ్లను తీసుకుంటే నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వుంటుందని వైద్యులు అంటున్నారు. పుచ్చకాయ లేదా సిట్రస్ పండ్లను రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు తీసుకున్నట్లైతే.. జీర్ణక్రియకు ఆటంకం తప్పదని వారు చెప్తున్నారు. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.
ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విశేషమైన విజయం
విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), కానూరు, అత్యంత సవాలుతో కూడిన ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IVతో ఇబ్బంది పడుతున్న 62 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా చికిత్సను చేసినట్లు వెల్లడించింది. బరువు తగ్గడం, గత ఆరు నెలలుగా తీవ్రమైన వెన్నునొప్పి వంటి సమస్యలతో అతను పలు హాస్పిటల్స్ తిరిగారు. ప్రారంభంలో ఇతర ఆసుపత్రులలో పరీక్షలు చేసినప్పుడు, అతని పొత్తికడుపులో పలు పెద్ద లింప్ నోడ్స్ ఉన్నాయని కనుగొనబడింది. క్షయవ్యాధి ప్రోటోకాల్ల క్రింద అతనికి చికిత్స చేశారు. అయినప్పటికీ, నిరంతర సమస్యల కారణంగా, డాక్టర్ సాయికృష్ణ కొల్లూరు వద్ద పరీక్ష చేయించుకోవటం కోసం విజయవాడలోని AOIకు వచ్చారు.
చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు
ఈరోజుల్లో చాలామందికి స్పూనులతో భోజనం చేయడం అలవాటుగా మారింది. కానీ స్పూన్లతో కాకుండా చేతులతో ఆహారం తినడం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చేతితో భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్పూన్లకు బదులుగా చేతితో భోజనం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే చేతిలో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా వుంటుంది. చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. వేళ్ల కొనలతో పదార్థాలను కలిపినప్పుడు ఆహారం యొక్క ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. ఇది మీరు తినబోయే ఆహారం కోసం మెదడును సిద్ధం చేస్తుంది. ఆహారాన్ని చేతులతో తినడం వల్ల మంచి రుచి వస్తుంది.