పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. ఎందుకో అందరూ ఆచార్య అంటారు.. (టీజర్)

శుక్రవారం, 29 జనవరి 2021 (16:49 IST)
మెగాస్టార్ చిరంజీవిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదలైంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
"ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి" అంటూ కొణిదెల ప్రొ కంపెనీ ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక.
 
"ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం... అలాంటి వాళ్ల జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు" అంటూ సాగే డైలాగుతో టీజర్ మొదలవుతుంది. 
 
అంతేకాదు, తనను 'ఆచార్య' అనడం వెనుకున్న కాన్సెప్ట్‌ను‌ కూడా చిరంజీవి వెల్లడించడం ఈ టీజర్‌లో చూడొచ్చు. పాఠాలు చెప్పే అనుభవం లేకపోయినా అందరూ నన్ను ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా.. గుణపాఠాలు చెబుతానని కాబోలు అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ అదిరిపోయింది. 
 
కాగా, ఈ సినిమాను కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించాడు. అలాగే, రామ్ చరణ్ కూడా సిద్ధూ అనే పాత్రలో కనిపించనున్నారు.
 

అన్నీ చూడండి

తెలంగాణాలో తొలిసారి సరస్వతీ నది పుష్కరాలు.. ప్రారంభించిన కంచి పీఠాధిపతి

స్నానం చేయమన్న తల్లి.. బావిలో దూకిన కుమార్తె.. ఎక్కడ?

పిల్లలను చూసేందుకు వచ్చిన భర్తను కొట్టి చంపేసిన భార్య

వరంగల్ జంట హత్యల కేసు : ముద్దాయి మరణించేంత వరకు ఉరితీయండి.. కోర్టు తీర్పు

అవినీతి అధికారులను పట్టిస్తే రూ.లక్ష రివార్డు : సీఎం విజయ్ వెల్లడి

అన్నీ చూడండి

ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...

లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

తర్వాతి కథనం
Show comments