పాన్ కార్డులకు కొత్త నిబంధన తీసుకొచ్చిన సీబీడీటీ

శుక్రవారం, 13 మే 2022 (14:03 IST)
పాన్ కార్డుకు కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా లేదా డిపాజిట్ చేసినా పాన్ లేదా ఆధార్ నంబరు తప్పనిసరిగా వెల్లడించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదాయపన్ను నిబంధనలు 1962లో పలు సవరణలు తీసుకొచ్చింది. 
 
సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు, విత్ డ్రాయల్స్‌కు కూడా ఈ నిబంధనను వర్తిస్తుందని సీబీడీటీ తెలిపింది. కాగా, రోజువారీ బ్యాంకు లావాదేవీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డు నంబరు వెల్లడించాలన్న నిబంధన ఉన్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల మేరకు 18 రకాల లావాదేవీలకు పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సివుంది. వాహనాలు కొనుగోలు లేదా అమ్మకం, బ్యాంకు ఖాతాఓపెన్ చేయడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు దరఖాస్తు చేయడం, హోటల్ లేదా రెస్టారెంట్లలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం, రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో మ్యాచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేయడం వంటి పలు సందర్భాల్లో విధిగా పాన్ నంబరును  సమర్పించాలన్న నిబంధన ఉంది. 

అన్నీ చూడండి

Fauji Update: ఫౌజీ తిరుగుబాటు ప్రారంభమయింది, రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్

Mangli :హుషార్‌ పిట్టలు నుంచి మంగ్లీ ఆలపించిన హుషార్‌ గీతం టోంగా.. టోంగా

KA13 : హీరో, రచయిత, దర్శకుడిగా మూడు కీలక బాధ్యతల తో KA13 బిహైండ్-ది-సీన్స్

Akhil :అయ్యగారే నం.1 అన్న ఫ్యాన్‌ వల్లే పేరొచ్చింది - లెనిన్ ఐదు రోజుల కలెక్షన్స్

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

తర్వాతి కథనం
Show comments