రైలు పట్టాలపై సిలిండర్ పెట్టాడు.. అంతే ఎగిరిపడింది కానీ.. పేలలేదు..

ఆదివారం, 11 ఆగస్టు 2019 (12:03 IST)
సోషల్ మీడియాపై యువతకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేయడం కోసం వ్యూస్ కొట్టడం కోసం ఏకంగా ఓ సిలిండర్‌ను మీద పెట్టాడు ఓ ఆకతాయి. దానిపై రైలు వెళ్తే ఎలా వుంటుందో షూట్ చేయాలనుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా వేర్పాడుకు చెందిన రామిరెడ్డి అనే యువకుడు గతంలో రైలు పట్టాలపై బాణసంచి, బైకులను పెట్టి రైలు వాటిపై నుండి వెళ్లేప్పుడు ఎలా ఉంటుందో షూట్ చేసి యూట్యూబ్‌లో ఉంచేవాడు. కానీ ఈసారి సిలిండర్‌ను రైలు పట్టాలపై వుంచాడు. దానిపై రైలు వెళ్తే ఎలా ఉంటుందో షూట్ చేయాలనుకున్నాడు.
 
అయితే అదృష్టం బావుండి ఈ ఘటనలో పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. రైలు సిలిండర్ ను ఢీకొట్టడంతో వేగంగా దూరంగా ఎగిరిపడింది కానీ పేలలేదు. హైదరాబాద్‌కు చెందిన నరసింహ అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలను చూసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రామిరెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. 

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు నో చెప్పిన హనీరోజ్.. ఎందుకంటే?

Amir Khan: గౌరీతో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న అమీర్ ఖాన్?

హీరోతో ముద్దు సన్నివేశం.. భర్తను తోడుతెచ్చుకున్న హీరోయిన్.. ఎవరు? (video)

"పెద్ది"తో మళ్లీ ట్రోలింగ్‌కు గురైన జాన్వీ కపూర్.. దేవర తరహాలో గ్లామర్‌ ఓవర్ డోస్

కుట్రలు, కుతంత్రాలను అధిగమించి బ్లాక్‌బస్టర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది: నట్టి కుమార్

తర్వాతి కథనం
Show comments