పీకే సంచలన నిర్ణయం : నేడు కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన

సోమవారం, 2 మే 2022 (08:40 IST)
జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ఆయన.. ఏకంగా కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన సోమవారం కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఉత్తరాదిలో జోరుగా చర్చ సాగుతోంది. 
 
అంతేకాకుండా, ఐప్యాక్ నుంచి తప్పుకుని పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్‌లోనూ అదే హాట్ టాపిక్‌గా మారింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, బీహార్‌లో ఆదివారం భావసారూప్య పార్టీలతో ఆయన చర్చలు జరిపారు. 
 
మరోవైపు, ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. పైగా, ఆ పార్టీలో కీలక పదవిని ఆశించారు. కానీ, ఆయన ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లించింది. వ్యూహకర్త కమిటీలో ఒక సభ్యుడుగా మాత్రమే ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు మొగ్గు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. 

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments