ఆ అవసరం వచ్చినప్పుడల్లా సుశాంత్ నన్ను వాడుకున్నాడు: రియా చక్రవర్తి సన్సేషన్

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (19:39 IST)
సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ వాడకం బయటకు రావడంతో రియా చక్రవర్తి జైలులో పడింది. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తేలడంతో ఆమెతో పాటు ఆమె సోదరుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనకు బెయిల్ కావాలంటూ రియా కోర్టును అభ్యర్థిస్తోంది.
 
తన బెయిల్ పిటీషన్లో చనిపోయిన సుశాంత్ పైన ఆరోపణలు చేసింది. సుశాంతే తనను అవసరమొచ్చినప్పుడల్లా వాడుకున్నాడనీ, అతడు కేదార్ నాథ్ అనే సినిమా చేసేటపుడు గంజాయికి అలవాటుపడ్డాడని పేర్కొంది. అప్పటి నుంచి తనకు డ్రగ్స్ అవసరం వచ్చినప్పుడల్లా తమను వాడుకునేవాడనీ, తన పేరు బయటకు రాకుండా తమతో డ్రగ్స్ కొనిపించేవాడని ఆరోపించింది. తాము డ్రగ్స్ సుశాంత్ కోసం కొనుగోలు చేసాము తప్పించి తాము ఏనాడూ డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది. 
 
అసలు డ్రగ్స్ వాడిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడితే దాన్ని కొన్నవాళ్లకు 20 ఏళ్ల జైలు శిక్ష చట్టంలోని లొసుగులను ఎత్తిచూపుతోందంటూ తన బెయిల్ పిటీషన్లో రియా పేర్కొంది. కాగా సుశాంత్ పైన ఆమె ఆరోపణలు చేయడంపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments