పొత్తు పెట్టుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పేవారు, ఇదంతా గేమ్: పవన్ కళ్యాణ్

శనివారం, 15 ఫిబ్రవరి 2020 (19:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో భాజపా అగ్రనాయకులతో భేటీల మీద భేటీలు కావడంతో ఏపీ రాజకీయాల్లో హీటెక్కుతోంది. వైసీపీ ఏకంగా వచ్చే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీ నుంచి నలుగురికి కేంద్ర మంత్రులు కట్టబెట్టబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనితో ఈ విషయం కాస్తా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది.
 
ఈ ప్రచారంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "జగన్ రెడ్డి గారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటున్నట్లు నాకు సమాచారం ఏమీ లేదు. ఒకవేళ అలాంటిది ఏమయినా వుంటే తనకు భాజపా నుంచి ఫోన్ వచ్చి వుండేది. అలాంటిదేమీ లేదు. ఇదంతా ఏదో గేమ్ తప్ప మరేమీ కాదు. 
 
వాళ్లేదో ప్రచారం చేసుకుంటున్నారు కానీ భాజపా నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదు. పొత్తు వున్నదంటూ నమ్మి ప్రధాని మోదీ, అమిత్ షాలను అపార్థం చేసుకోవద్దు. వాళ్ల తరపున నేను చెపుతున్నా." అంటూ వెల్లడించారు.

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments