Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తు పెట్టుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పేవారు, ఇదంతా గేమ్: పవన్ కళ్యాణ్

Written By ఐవీఆర్
Updated: శనివారం, 15 ఫిబ్రవరి 2020 (19:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో భాజపా అగ్రనాయకులతో భేటీల మీద భేటీలు కావడంతో ఏపీ రాజకీయాల్లో హీటెక్కుతోంది. వైసీపీ ఏకంగా వచ్చే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీ నుంచి నలుగురికి కేంద్ర మంత్రులు కట్టబెట్టబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనితో ఈ విషయం కాస్తా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది.
 
ఈ ప్రచారంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "జగన్ రెడ్డి గారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటున్నట్లు నాకు సమాచారం ఏమీ లేదు. ఒకవేళ అలాంటిది ఏమయినా వుంటే తనకు భాజపా నుంచి ఫోన్ వచ్చి వుండేది. అలాంటిదేమీ లేదు. ఇదంతా ఏదో గేమ్ తప్ప మరేమీ కాదు. 
 
వాళ్లేదో ప్రచారం చేసుకుంటున్నారు కానీ భాజపా నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదు. పొత్తు వున్నదంటూ నమ్మి ప్రధాని మోదీ, అమిత్ షాలను అపార్థం చేసుకోవద్దు. వాళ్ల తరపున నేను చెపుతున్నా." అంటూ వెల్లడించారు.

అన్నీ చూడండి

అపుడు నటనకు పూర్తిగా స్వస్తి పలకాలని అనుకున్నాను : సమంత

బిగ్ బాస్ తెలుగులో బిగ్ ట్విస్ట్, ఏంటది?

ఈ వారం డిజాస్టర్ గా నిలిచిన సర్దార్ 2, మందాడి, మారెమ్మ చిత్రాలు

Deepika Padukone :దువా రెండవ పుట్టినరోజున గర్బిణీ ఫొటోలను పంచుకున్న దీపికా పడుకోన్

సినిమాలను వదులుకుంటానన్న సమంత.. వద్దని మా ఇంటి బంగారం చేసిన రాజ్

తర్వాతి కథనం
Show comments