తాంత్రిక పూజలు చేశాను.. నిజమే.. క్షమించండి.. రాధాకృష్ణ

ఆదివారం, 30 డిశెంబరు 2018 (17:10 IST)
సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పగటిపూట చేయాల్సిన పూజలను అర్థరాత్రి చేయడంపై గతంలో వివాదం చెలరేగింది. దీంతో ఆలయ వేద పండితుడు రాధాకృష్ణ శర్మను విధుల నుంచి బోర్డు తప్పించింది. ఈ నేపథ్యంలో ఆలయ వేద పండితుడు రాధాకృష్ణ శర్మ కాస్త వెనక్కి తగ్గారు. తాను తాంత్రిక పూజలు చేశానని.. దయచేసి క్షమించండంటూ.. శ్రీశైలం ఆలయ ఈవోకు లేఖ రాశారు. 
 
తన ఇంట్లో రాత్రిపూట పూజలు చేసిన మాట నిజమేనని రాధాకృష్ణ చెప్పారు. హైదరాబాదుకు చెందిన సురేశ్ చంద్రతో కలిసి తాను పూజలు చేశానని అంగీకరించారు. తనపై వచ్చిన అభియోగాలన్నీ నిజమని రాధాకృష్ణ శర్మ అంగీకరించారు.
 
భవిష్యత్‌లో ఇలాంటి పనులు చేయబోనని, క్షమించి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ ఏపీ మానవహక్కుల కమిషన్, హైకోర్టుల్లో దాఖలుచేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటానని వెల్లడించారు.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments