తాంత్రిక పూజలు చేశాను.. నిజమే.. క్షమించండి.. రాధాకృష్ణ

ఆదివారం, 30 డిశెంబరు 2018 (17:10 IST)
సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పగటిపూట చేయాల్సిన పూజలను అర్థరాత్రి చేయడంపై గతంలో వివాదం చెలరేగింది. దీంతో ఆలయ వేద పండితుడు రాధాకృష్ణ శర్మను విధుల నుంచి బోర్డు తప్పించింది. ఈ నేపథ్యంలో ఆలయ వేద పండితుడు రాధాకృష్ణ శర్మ కాస్త వెనక్కి తగ్గారు. తాను తాంత్రిక పూజలు చేశానని.. దయచేసి క్షమించండంటూ.. శ్రీశైలం ఆలయ ఈవోకు లేఖ రాశారు. 
 
తన ఇంట్లో రాత్రిపూట పూజలు చేసిన మాట నిజమేనని రాధాకృష్ణ చెప్పారు. హైదరాబాదుకు చెందిన సురేశ్ చంద్రతో కలిసి తాను పూజలు చేశానని అంగీకరించారు. తనపై వచ్చిన అభియోగాలన్నీ నిజమని రాధాకృష్ణ శర్మ అంగీకరించారు.
 
భవిష్యత్‌లో ఇలాంటి పనులు చేయబోనని, క్షమించి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ ఏపీ మానవహక్కుల కమిషన్, హైకోర్టుల్లో దాఖలుచేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటానని వెల్లడించారు.

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments