1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. The Moment Noida's Supertech Twin Towers Came Down

క్షణాల్లో నేలకూలిన ట్విన్ టవర్స్... ఖర్చు రూ.20 కోట్లు

noida twin towers
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలను అతిక్రమించి నిర్మించిన ట్విన్ టవర్స్‌ను ఆదివారం కూల్చివేశారు. ఈ టవర్స్ కూల్చివేతకు 3700 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించారు. మూడేళ్లపాటు శ్రమించిన నిర్మించిన ఈ టవర్స్‌ను కేవలం 9 సెకన్లలో కూల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
గత 2009లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్‌ను రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన నిర్మించింది. ఇందుకోసం మొత్తం రూ.70 కోట్లను ఖర్చు చేసింది. మూడేళ్ల కాలంలో నిర్మాణం పూర్తి చేసింది. ఈ జంట భవనాలు అపెక్స్ టవర్ ఎత్తు 102 మీటర్లు కాగా ఇందులో 30 అంతస్తులు ఉన్నాయి. సియాన్ టవర్స్ ఎత్తు 95 మీటర్లు కాగా, ఇందులో 915 ఫ్లాట్స్, 21 షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. 
 
అయితే, నిబంధనలు ఉల్లంఘించి ఈ టవర్స్ నిర్మించారంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ ట్విన్ టవర్స్‌ను కూల్చి వేయాలని గత యేడాది సంచలన తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ టవర్స్‌ను కూల్చివేసేందుకు గ్రేటర్ నోయిడా అధికారులు చర్యలు చేపట్టారు. 
 
ఇందులోభాగంగా, ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతాల్లో ఈ టవర్స్‌ను కూల్చివేశారు. ఇందుకోసం 3700 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించి, కేవలం 9 సెకన్లలో కూల్చివేశారు. ప్రైమరీ బ్లాస్ట్‌కు 7 సెకన్ల సమయం పట్టగా, సెకండరీ బ్లాస్ట్ కేవలం 2 సెకన్ల సమయం మాత్రమే పట్టింది. 
 
ఈ టవర్స్‌ నిర్మాణానికి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కుతుబ్ మినరా, ఇండియా గేట్ కంటే ఎత్తయిన ఈ భారీ టవర్స్‌ను కూల్చివేసేందుకు అధికారులు రూ.20 కోట్ల ఖర్చు చేశారు. ఈ మొత్తంలో రూ.13.5 కోట్లను శిథిలాల తొలగింపునకే కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం గమనార్హం. 


 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య