రైలు ఢీకొన్నా.. ఆ వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు.. లక్ అంతే అదే! (video)

శనివారం, 12 నవంబరు 2022 (19:08 IST)
Man
రైలు ఢీకొన్నా.. ఆ వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు. రైలు ఢీకొన్నా.. ప్రాణాలతో బయటపడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా అదృష్టవంతుడేనని కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని భాగల్ పూర్‌లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ను హడావుడిగా దాటుతూ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. 
 
రైలు మొత్తం అతని మీదుగా వెళ్ళింది. కానీ అతను ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భాగల్ పూర్ స్టేషన్‌ పట్టాలపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ స్టేషన్‌‌లో ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ ఫామ్ నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ షార్ట్ కర్ట్ కోసం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. 
 
పట్టాలపై ఉన్న రైలు కిందకు దూరగానే ఉన్నట్టుండి ట్రైన్ కదిలింది. దీంతో రైలు కింద చిక్కుకుపోయాడు. భయంతో పట్టాల కిందే వుండిపోయాడు. అతనిని చూసిన జనం షాకయ్యారు. రైలు దాటిన తర్వాత షాక్‌తో లేచి నిలబడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమీపంలో వున్న వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments