సమ్మర్ స్పెషల్ : కమ్మని మజ్జిగతో పుల్లట్లు ఎలా చేయాలి?

గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:08 IST)
అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్లో శరీరానికి చల్లదనాన్నిచ్చే పెరుగు, మెంతులతో చేసే వంటకాలను తీసుకుంటే మంచిది. మజ్జిగ ఆరోగ్యానికి క్యాల్షియం అందజేస్తుంది. ఇక మెంతులు శరీర ఉష్ణాన్ని నియంత్రించి అందం, ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. ఇక కేశాలను, చర్మాన్ని సంరక్షిస్తుంది. అలాంటి మజ్జిగ, మెంతులతో పుల్లట్లను వెరైటీగా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
పుల్లటి మజ్జిగ : నాలుగు కప్పులు 
బియ్యం - రెండు కప్పులు 
మెంతులు - మూడు స్పూన్లు 
జీలకర్ర - రెండు స్పూన్లు 
పచ్చిమిర్చి- ఆరు 
ఉప్పు - తగినంత 
జీలకర్ర - స్పూన్ 
నూనె - తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర దంచి పిండిలో కలిపి దోసెలపిండి మాదిరిగా పెనంపై పలుచగా చేసుకోవాలి. ఇరు వైపుల నూనె, లేదా నేతిని పోయాలి. ఇక దోసెలు దోరగా వేగాక సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. ఈ దోసెలను గ్రీన్ చట్నీ లేదా టమోటా చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!

అన్నీ చూడండి

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments