Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో... పాపం...! అన్యాయంగా బలయ్యారు.. లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు... ఇద్దరు మృతి

Written By pyr
Updated: సోమవారం, 5 అక్టోబరు 2015 (09:26 IST)
వారు ఏ పాపం ఎరుగరు. తన విధి నిర్వహణగా పంక్చరయి టైర్‌ ఊడదీసే పనిలో ఉన్నారు. అయితే మృత్యువు వారిని ప్రైవేటు బస్సు రూపంలో అమాంతం మింగేసింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. విజయవాడ-మంగళగిరి మధ్య జాతీయ రహదారిపై జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా నరసారావుపేట నుంచి విజయవాడ వెళ్తున్న మినీ లారీ టైర్‌ పంక్చర్‌ అయింది. తాడేపల్లి వద్ద క్లీనర్‌ సాయి సుధీర్‌ అనే మరో వ్యక్తి సహాయంతో టైర్‌ మార్చుకుంటున్నారు. అదే సమయంలో ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఒకటి శర వేగంగా దూసుకు వచ్చి లారీని ఢీకొంది. టైరు మార్చుతున్న సాయి (35), సుధీర్‌(30) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
వేగంగా ఢీకొనడంతో బస్సు డ్రైవర్‌ వెంకటనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులో 25 మంది ప్రయాణికులుండగా 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
About Author
pyr
PYR.... Read More

అన్నీ చూడండి

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు

హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. అగధ తో నేనూ ఆశిస్తున్నా: శ్రవణ్ రెడ్డి

డెంగ్యూ బారిన పడిన సినీ నటి అవికా గోర్.. భర్త ఏమన్నారంటే? (video)

Show comments