శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (09:38 IST)

పొదల్లో వివాహితతో ఎంజాయ్ చేసిన యువకుడు, ఉన్నట్లుండి పురుగుల మందు తాగాడు

చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం దోనిరేవుల పల్లెలో విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ సెలక్షన్స్ ఉన్నాయంటూ బెంగుళూరు నుంచి స్వగ్రామానికి వచ్చిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఒక వివాహితతో కలిసి ఇంటికి సమీపంలో ఊరు బయటే ఆత్మహత్య చేసుకున్నాడు. అసలెందుకు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే...
 
దిలీప్ కుమార్ బెంగుళూరులో స్నేహితులతో కలిసి ఉండేవాడు. ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. అయితే చిత్తూరులో ఆర్మీ సెలక్షన్స్ జరుగుతోందని స్నేహితుల ద్వారా తెలుసుకుని వారం క్రితం స్వగ్రామం యాదమర్రి మండలం దోనిరేవులపల్లికి వచ్చాడు. 
 
అక్కడ తన ఇంటికి సమీపంలో ఉన్న వివాహితతో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. తరచూ దిలీప్ కుమార్ ఆమె ఇంటికి వెళ్ళడంతో స్థానికులు ఆమె భర్తకు విషయం చెప్పారు. దీంతో ఆ వివాహితపై భర్త చేయిచేసుకోవడమే కాకుండా పంచాయతీ పెట్టాడు. ఇది కాస్త గ్రామంలో పెద్ద రచ్చే జరిగింది.
 
వివాహితకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వివాహితే సర్వస్వం అనుకున్నాడు దిలీప్ కుమార్. ఆమెను గ్రామ సరిహద్దులోకి తీసుకెళ్ళాడు. ఇద్దరూ కలిసి శారీరకంగా కలిసిన తరువాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
 
అయితే దిలీప్ కుమార్ అక్కడికక్కడే చనిపోగా వివాహిత చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తాను విషం తాగానన్న విషయాన్న దిలీప్ స్వయంగా బంధువులకు ఫోన్ చేశాడు. అయితే అతను ఎక్కడున్నాడని గుర్తించేలోపే చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.