ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల.. 92.85% మంది అర్హత

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్ సెట్ (ఈఏపీ సెట్) అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. తాజాగా అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షా ఫలితాలను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాట్లాడుతూ.. ఏపీ ఈఏపీ సెట్‌లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మాకు మొత్తంగా 2,59,688 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
 
అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షల కోసం 83,820 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇక ఈ పరీక్షలకు 78,066 మంది విద్యార్థులు హాజరు కాగా 72,488 మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన వెల్లడించారు. 
 
ఇక హాజరైన విద్యార్థుల్లో 92.85% మంది విద్యార్థులు అర్హత పొందారన్నారు. అలాగే రేపటి నుంచి ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ కాకినాడకు, అధికారులకు, సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments