జంటపై ఆగంతకుల హత్యాయత్నం: వ్యక్తి మృతి!
ఓ జంటపై ఆగంతకుల హత్యాయత్నం చేసిన ఘటనలో అమరేష్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శశికళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాలం మండలం మెగలినూరులో చోటుచేసుకుంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వివాహేతర సంబంధమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమరేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు.