శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 10 డిశెంబరు 2016 (15:18 IST)

పించన్‌దారులు షాక్... తమ ఖాతాల్లో రూ.80 లక్షల బ్లాక్ మనీ డిపాజిట్

పెద్ద నోట్ల రద్దుతో కుప్పలుతెప్పలుగా పోసుకుని ఉన్న రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లను ఏం చేయాలో అర్థం కావడంలేదు నల్ల కుబేరులకు. దాంతో బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై ఎలాగోలా తమ పనులు కానించేస్తున్నారు. కోట్లకు కోట్లు నల్లడబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేస

పెద్ద నోట్ల రద్దుతో కుప్పలుతెప్పలుగా పోసుకుని ఉన్న రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లను ఏం చేయాలో అర్థం కావడంలేదు నల్ల కుబేరులకు. దాంతో బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై ఎలాగోలా తమ పనులు కానించేస్తున్నారు. కోట్లకు కోట్లు నల్లడబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేస్తున్నారు. కొందరు బ్యాంకు సిబ్బంది కమీషన్లకు కక్కుర్తి పడటంతో నల్ల బాబులు ఎంచక్కా నల్ల డబ్బును వైట్ చేసుకుని కాలర్ ఎగరేసుకుని వెళుతున్నారు. తాజాగా ఓ షాకింగ్ విషయం బయటపడింది. 
 
తూర్పుగోదావరి జిల్లాలో రౌతులపూడిలో ఏడుగురు పించన్ దారుల ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాలో రూ.80 లక్షలు చొప్పున నల్లధనం డిపాజిట్ అయ్యింది. ఈ డబ్బు తమకు తెలియకుండా తమ ఖాతాల్లో పడటంపై పించన్‌దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ ఖాతాల్లో జమ అయిన డబ్బు బ్లాక్ మనీ అయి ఉంటుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఐతే బ్యాంకు సిబ్బంది మాత్రం... సర్వర్ ఫాల్ట్ వల్ల ఇలా డబ్బు డిపాజిట్ అయినట్లు తెలియజేస్తున్నారు. కానీ బ్యాంకు సిబ్బంది మాటలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి దానిపై విచారణ చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.