Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

Written By ఎం
Updated: ఆదివారం, 13 డిశెంబరు 2020 (07:57 IST)
గ్రూప్‌-1 మెయిన్స్‌ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే 9,679 మంది అభ్యర్థుల కోసం ఏపీ, తెలంగాణల్లో 41 కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 7 సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.

ఈ నెల 14న తెలుగులో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌), 15న ఇంగ్లి్‌షలో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌), 16న పేపర్‌-1, 17న పేపర్‌-2, 18న పేపర్‌-3, 19న పేపర్‌-4, 20న పేపర్‌-5 జరుగుతాయి. పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు ఆన్‌లైన్‌లోనే అందజేస్తారు. ప్రశ్నపత్రాలు ఇంగ్లీషు, తెలుగు వెర్షన్‌లో స్ర్కీన్‌లో కనిపిస్తాయి.

అన్ని పేపర్లు కూడా డిస్ర్కిప్టివ్‌లోనే ఉంటాయి. జవాబులను కమిషన్‌ అందజేసే బుక్‌లెట్‌లో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజినల్‌ ఫోటో ఐడి ఆధారంతో ఉదయం 8.45 నుంచి 9.30 గంటల మధ్య పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారు.

15 నిమిషాలు అంటే 9.45 వరకు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. గ్రేస్‌ పీరియడ్‌ దాటిన తర్వాత ఎవ్వరినీ పరీక్ష హాలులోకి అనుమతించరు. అభ్యర్థుల వెంట ఎలకా్ట్రనిక్‌ వస్తువులను తీసుకురానీయరు.

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకోమంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments