Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది నుంచి ఆన్​లైన్​లో ఇంటర్ ప్రవేశాలు

Written By ఎం
Updated: గురువారం, 20 ఫిబ్రవరి 2020 (08:48 IST)
రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆన్​లైన్​లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించిందన్నారు.

బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ చట్టాలకు అనుగుణంగానే ఇంటర్​ కళాశాలలు పనిచేయాలని.. దానికి భిన్నంగా ర్యాంకుల పేరిట వ్యాపార ధోరణితో ముందుకు వెళ్తుండటం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

ప్రైవేటు, ఎయిడెడ్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంటర్​ విద్యలో 70 శాతం కళాశాలలు ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నాయని.. వాటి పనితీరులో లోపాలను సమావేశంలో మంత్రి ప్రస్తావించారు.

కోచింగ్‌ సెంటర్లు, ఇంటర్మీడియట్‌ కళాశాలలను కలపొద్దని స్పష్టం చేశారు. పరిమితికి మించి విద్యార్థులున్న కళాశాలలకు నోటీసులు ఇచ్చామని మంత్రి తెలిపారు.

నాణ్యత ప్రమాణాలతోపాటు ఫీజులు అందరికీ అందుబాటులో ఉండేలా ఫీజ్ రెగ్యులేటరీ కమిషన్ కళాశాలలను తనిఖీ చేస్తుందన్నారు.

అన్నీ చూడండి

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్

మగవాడికి కమిట్‌మెంట్ ఇవ్వనిదే సినిమా ఛాన్సే కాదు సీరియల్ ఛాన్స్ కూడా రాదు, యువతి వీడియో వైరల్

Genelia Deshmukh: అభిమానుల ప్రేమతో 39వ పుట్టినరోజు జరుపుకున్న జెనీలియా దేశ్‌ముఖ్

Jayam Ravi: భార్యతో విడాకులు.. వడ్డీ కాసుల వాడిగా జయం రవి

Anand Deverakonda :బీచ్ పోస్టర్‌తో ఆనంద్ దేవరకొండ... ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments