జగన్ గారూ!.. అందుకేనా మూడు రాజధానులు? : లోకేశ్ సెటైర్లు

శనివారం, 4 జులై 2020 (11:19 IST)
అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు వేశారు.
 
"జగన్ గారూ! మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేసి మీ అవినీతి భాగస్వామికొకటి, మీ తప్పుడు పత్రిక నిర్వాహకునికి ఒకటి, మీ మామకొకటి ఇచ్చేసుకోడానికా...  29,881 మంది రైతులు రాజధాని అమరావతి కోసం త్యాగం చేసింది?
 
మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు, రైతు కూలీలు బలయ్యారు. వారి త్యాగాలను పణంగా పెట్టే మీ ఆటలు సాగనివ్వం. 200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా?
 
రాష్ట్రప్రజలరా! ఇది రాజధాని రైతు సమస్య మాత్రమే కాదు. విధ్వంసకర పాలనకు, ప్రజా ద్రోహానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. అందుకే కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏకంకండి. "ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని" అంటూ అమరావతి కోసం ఉద్యమిద్దాం. జై అమరావతి!" అని పేర్కొన్నారు.

అన్నీ చూడండి

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

తర్వాతి కథనం
Show comments