శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2016 (15:08 IST)

నిమ్స్‌ ఆస్పత్రిలో పాతనోట్లను తీసుకుని కొత్త నోట్లిచ్చిన జనసేన కార్యకర్తలు..

జనసేన పార్టీ కార్యకర్తలు పాత నోట్లతో ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనిచ్చారు. శని, ఆదివారాలు బ్యాంకులు బంద్. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలోని రోగులు ఇబ్బంది పడకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ

జనసేన పార్టీ కార్యకర్తలు పాత నోట్లతో ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనిచ్చారు. శని, ఆదివారాలు బ్యాంకులు బంద్. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలోని రోగులు ఇబ్బంది పడకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆసుపత్రిలో పండ్లు, మందులు పంపిణీ చేశారు. బ్యాంక్ సెలవు రోజులు కావడంతో  జనసేన కార్యకర్తలు ఆదివారం నిమ్స్ ఆసుపత్రిలో పండ్లు, మందులు పంచి పెట్టారు. అనంతరం కొందరు రోగుల నుంచి పాత రూ.500, రూ.1000 నోట్లను తీసుకొని, కొత్త నోట్లను అందించారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు కావడంతో రోగులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో తమవంతు సహకారం అందించామన్నారు. పాత నోట్లను మార్చుకునే వీలు లేకపోవడంతో తాము కొత్త నోట్లను ఇచ్చామన్నారు. 
 
మరోవైపు పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. అయితే ఈ నిర్ణయం అమలులో లోపాల గురింతే తాము ఆందోళన చెందామని చెప్పుకొచ్చారు. ప్రజాజీవనం సజావుగా సాగేలా, వ్యాపార లావాలదేవీలు జరిగేలా చూడాలని కేంద్రానికి చెప్పామని తెలిపారు.