కాకినాడ గెలుపు చాలా ఆనందాన్ని ఇచ్చింది : మంత్రులతో చంద్రబాబు

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ సంపూర్ణ మెజార్టీని సాధి

శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (11:41 IST)
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ సంపూర్ణ మెజార్టీని సాధించి మున్సిపాలిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 
 
చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కాకినాడను కైవసం చేసుకోవడంపై చంద్రబాబు తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. కొద్దిసేపటి క్రితం ఫలితాలను మంత్రులతో కలసి సమీక్షించిన ఆయన, గెలుపునకు కృషి చేసిన వారిని అభినందించారు. ఈ ఫలితం తనకు సంతృప్తినిచ్చిందని, ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేద్దామని అన్నారు. 
 
మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి, కళా వెంకట్రావులతో సమావేశమైన చంద్రబాబు, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటివరకూ విడుదలైన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 30, బీజేపీ 3, వైకాపా 9, ఇతరులు 3 స్థానాలను (గెలుపు ప్లస్ ఆధిక్యం) దక్కించుకున్నారు. 

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments