బియ్యం కోసం పొరుగింటికి వెళ్ళిన బాలిక.. విరుచుకుపడిన కామాంధుడు..

శనివారం, 5 జనవరి 2019 (12:32 IST)
ఏడేళ్ల చిన్నారిపై కామాంధుడు విరుచుకుపడ్డాడు. బియ్యం కోసం వచ్చిన పొరుగింటి బాలికను ఇంట్లోకి పిలిపించుకున్న ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దమ్మపేట మండలానికి చెందిన ఏడేళ్ల బాలికను ఆమె తల్లి బియ్యం కోసం పొరుగు ఇంటికి పంపింది. 
 
ఆ చిన్నారి వెళ్లిన సమయానికి సదరు పొరుగింటి మహిళ ఇంట్లో లేదు. బాలిక రావడాన్ని అదనుగా తీసుకున్న ఆమె భర్త బియ్యం ఇస్తానంటూ బాలికను ఇంట్లోకి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎంత సేపటికి కుమార్తె ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లి.. పొరుగింటికి వెళ్లి చూడటంతో ఈ బాగోతం బయటపడింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments