Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు : ఆర్టీసీ బస్సులో 14.8 కేజీల బంగారం స్వాధీనం

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 26 మార్చి 2021 (16:23 IST)
కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులో 14.8 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా పంచాలింగాల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా బస్సులో ఓ ప్రయాణికుడి వద్ద 14.8 కిలోల బంగారం పట్టుబడింది. 
 
తెలంగాణ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు ఆపి తనిఖీ చేయగా రాజు అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగును చెక్‌పోస్ట్ పోలీసులు తనిఖీ చేశారు. దీంతో అతన్ని నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన కమ్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ నగల దుకాణంలో రాజు పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
తన యాజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో నుంచి బంగారం తరలిస్తున్నట్లు నిందితుడు పేర్కొన్నారు. సరియైన పత్రాలు గానీ, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి బంగారాన్ని సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. 

అన్నీ చూడండి

నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

తర్వాతి కథనం
Show comments