స్వయం సహాయక సంఘాలకు మాస్కుల తయారీ పని

గురువారం, 16 ఏప్రియల్ 2020 (20:08 IST)
మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. తొలుత ‘కరోనా’ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని, ప్రతి ఒక్కరికీ 3 మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పక పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి మాస్కుల పంపిణీ ప్రారంభిస్తామని, రెండు రోజుల తర్వాత మాస్కుల పంపిణీ విస్తృతం చేస్తామని జగన్ కు అధికారులు తెలిపారు.

క్వారంటైన్ ప్రాంతాల్లో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలని, క్వారంటైన్ పూర్తి చేసుకుని తమ ఇళ్లకు వెళ్లే వాళ్లకు రూ.2 వేల చొప్పున అందజేయాలని ఆదేశించారు. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను, మత్స్య కార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని జగన్ ఆదేశించారు.

ఆర్టీకే కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని, ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి చేసేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని, సరికొత్త పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అన్నీ చూడండి

పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్

Prabhas: ప్రభాస్ లాంచ్ చేసిన వరుణ్ తేజ... కొరియన్ కనకరాజు టీజర్‌

Jani Master: మా మధ్య గొడవలు లేవు, డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళం : జానీ మాస్టర్

Bhagyashri: రాజమౌళి గారి దర్శకత్వంలో రాణి లా నటించాలని కోరిక : భాగ్యశ్రీ బోర్సే

SS Karthikeya: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి జానర్‌లో సినిమా రాలేదు :ఎస్ఎస్ కార్తికేయ

తర్వాతి కథనం
Show comments