శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:43 IST)

రైల్వే జ‌న‌ర‌ల్ బోగీల్లోకి ఇక య‌థేచ్ఛ‌గా ఎక్క‌వ‌చ్చు...

రైల్వే సాధార‌ణ ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌. మీరు రైళ్లలోని జనరల్‌ బోగీల్లోకి ఇక కొవిడ్‌కు ముందు మాదిరే య‌ధేచ్ఛ‌గా ప్రయాణం చేయవచ్చు. కోవిడ్ నిబంధ‌న‌ల వ‌ల్ల గ‌తంలో రిజర్వేష‌న్ త‌ప్ప‌ని స‌రి కానీ, ఇపుడు ఆ రిజర్వేషన్‌ అవసరం లేదు.

స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌ కౌంటర్లలో అన్ రిజర్వుడ్‌ టికెట్‌ తీసుకుని రైలెక్కి ప్రయాణం చేయవచ్చు. ఈ నిర్ణయం ఈ నెల 24 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్ర‌స్తుతానికి హైదరాబాద్‌ - పూర్ణ రైలులో మాత్రం 22 నుంచి అమలు చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

జోన్‌ పరిధిలోని 74 రైళ్లలో జనరల్‌ బోగీలను రిజర్వేషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో సికింద్రాబాద్‌ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, గుంటూరులో 5, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో 6, నాందేడ్‌లో 12 రైళ్లున్నాయి.