ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

శనివారం, 17 జులై 2021 (19:32 IST)
జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 63,100 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 36,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.473 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతం 316.750 మీటర్లకు చేరుకుంది.
 
దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 37,150 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 810.50 అడుగులు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 34.6077 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments