దేవినేని అక్క జైలుకెళా వెళ్ళాడో చూశాం కదా, రోజా వ్యంగాస్త్రాలు

శుక్రవారం, 30 జులై 2021 (23:21 IST)
తెలుగుదేశం పార్టీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. మహిళలకు కేటాయించిన ఇళ్ళ స్ధలాల్లో మైనింగ్ జరిగిందని హడావిడి చేసిన దేవినేని (ఉమ) అక్క ఎలా జైలు పాలయ్యాడో మనం చూశామంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. 
 
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్థి చూసి కడుపు మంటతో టిడిపి నాయకులు ఉన్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇళ్ళు పేద వాళ్ళకు ఇవ్వాలని నిర్ణయించి 3 లక్షల ఇళ్ళు కట్టకుండా ప్రజలను మోసం చేశారన్నారు.
 
నామినేటెడ్ పదవులకు 50 శాతం మహిళలకు ఇచ్చిన మాట మాట నిలబెట్టుకున్నారని.. దేశం మొత్తం నాలుగు ఇళ్ళు నిర్మిస్తుంటే అందులో ఒక ఇల్లు ఎపిలో నిర్మించడం విశేషమన్నారు. 
 
నాలుగు లక్షల కోట్ల ఆస్తిని మహిళలకు అందించడం మామూలు విషయం కాదని.. రాష్ట్రంలో 28 లక్షల మంది మహిళలకు ఇళ్ళు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు.
 
కరోనా థర్డ్ వేవ్ వస్తుందని ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలన్నారు. చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. 

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments