Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్నఎమ్మెల్యే రోజా

Updated: బుధవారం, 28 జులై 2021 (15:05 IST)
చాలా రోజుల త‌ర్వాత ఎమ్మెల్యే రోజా త‌న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వడమాలపేట మండలం పూడిలో 21 లక్షల రూపాయలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రానికి ఆమె శంకుస్తాప‌న చేశారు. అలాగే, 17.50 లక్షలతో నిర్మించనున్న వెల్నెస్ సెంటర్ భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ రెండింటికీ క‌లిపి  నిర్మించనున్న కాంపౌండ్ వాల్ కు ఎమ్మెల్యే ఆర్కే రోజా భూమి పూజ చేశారు. సచివాలయం భవనంలో 2.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బోరు మోటారు పనుల‌ను రోజా స్విచ్ ఆన్ చేసి ప్రారంభోత్సవం చేసారు. అస‌లే అస‌మ్మ‌తి సెగ‌తో ర‌గిలిపోతున్న న‌గ‌రి నియోజ‌క‌వర్గంలో మ‌ళ్లీ రోజా త‌న హవా కొన‌సాగిస్తున్నార‌ని ఆమె అనుచ‌రులు చెప్పారు.

ఎమ్మెల్యే నిరంత‌రం అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పైనే ఆలోచిస్తార‌ని, త‌న వెనుక నుంచి కుయుక్తులు ప‌న్నే వారిని రోజా ప‌ట్టించుకోర‌ని చెపుతున్నారు. ఎమ్మెల్యే రోజాకు వ‌చ్చే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వి ఖాయం అని పేర్కొంటున్నారు.

అన్నీ చూడండి

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments