1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (19:46 IST)

ఆర్టీసీ విభజన పూర్తి.. మే 14 నుంచి వేర్వేరు పాలన

ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ విభజనను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్రాల విభజన పూర్తయి, వివిధ శాఖల కూడా విభజన పూర్తయ్యింది. అయితే ఏపిఎస్ ఆర్టీసీ మాత్రం విభజన ఇంతకాలం పూర్తి కాలేదు. దీని కోసం ఓ ప్రత్యేకమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటి ఇటీవల విభజనను పూర్తి చేశారు. ఎప్పటి నుంచి వేర్వేరు పాలన చేయాలో కూడా నిర్ణయించారు. 
 
ఇరు రాష్ట్రాలకు అధికారుల విభజనను ఆర్టీసీ యాజమాన్యం పూర్తిచేసింది. మే 14 నుంచి విడివిడిగా ఆర్టీసీ పరిపాలన కార్యకలాపాలు సాగనున్నాయి. ఆరోజు నుంచి టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ పరిపాలన విభాగాలు విడివిడిగా పనిచేయడం ప్రారంభిస్తాయి. పరిపాలన విభాగాలకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు.