మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ తాగించి.. ఆర్టీసీ డ్రైవర్ అత్యాచారం.. ఎక్కడ?

స్నేహితుడైన ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అంతే ఆమె భార్య, కుటుంబం పట్ల సానుభూతిని చూపాల్సిందిపోయి.. మరో ఆర్టీసీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన చెంగిచర్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.

బుధవారం, 19 సెప్టెంబరు 2018 (14:47 IST)
స్నేహితుడైన ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అంతే ఆమె భార్య, కుటుంబం పట్ల సానుభూతిని చూపాల్సిందిపోయి.. మరో ఆర్టీసీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన చెంగిచర్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్‌కు చెందిన శ్యాంసుందర్ రెడ్డి జీడిమెట్ల డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. 
 
ఈ నేపథ్యంలో తన కుటుంబాన్ని పోషించేందుకు ఉపాధి చూపాలని అతని భార్య ఆర్టీసీ అధికారులను కోరింది. ఈ క్రమంలో చెంగిచర్ల డిపోలో డ్రైవర్‌గా, డీపో టీఎంయూ కార్యదర్శిగా పనిచేస్తున్న సోమసాయిలు పరిచయం అయ్యాడు. యూనియన్ నాయకుడు కావడంతో న్యాయం చేస్తాడని నమ్మిన ఆమెకు అతనితో బాగా స్నేహం కుదిరింది. 
 
అధికారులతో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా చేస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, ఖాళీ చెక్కులు, ప్రామీసరీ నోట్లు తీసుకున్నాడు. ఒక రోజు ఉద్యోగం వచ్చిందని చెప్పి... పార్టీ ఇవ్వాలని కోరాడు. సాయిలు మాటలు నమ్మిన ఆమె ఆనందంగా ఇంట్లోనే పార్టీ ఇచ్చింది.
 
పీకల దాకా మద్యం తాగిన అతను ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. మత్తులోకి జారుకున్న తర్వాత అత్యాచారానికి పాల్పడటంతో పాటు పలుమార్లు బెదిరించి తనను లోబరుచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సోమసాయిలను అదుపులోకి తీసుకున్నారు.

అన్నీ చూడండి

'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్‌బ్లోయింగ్‌, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

తర్వాతి కథనం
Show comments