1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2016 (13:21 IST)

బెయిల్ వచ్చేవరకు పారిపో.. ప్రొఫెసర్ లక్ష్మికి సలహా ఇచ్చిన రిటైర్డ్ జడ్జి

గుంటూరు వైద్య కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో బెయిల్ వచ్చేంత వరకు ఎవరికీ చిక్కకుండా పారిపోవాల్సిందిగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మికి ఓ రిటైర్డ్ జడ్జితో పాటు ర

గుంటూరు వైద్య కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో బెయిల్ వచ్చేంత వరకు ఎవరికీ చిక్కకుండా పారిపోవాల్సిందిగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మికి ఓ రిటైర్డ్ జడ్జితో పాటు రిటైర్డ్ పోలీసు అధికారి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులు విచారణలో ప్రొఫెసర్ లక్ష్మి బహిర్గతం చేసింది. అయితే, ఆ రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ పోలీసు అధికారి పేర్లను మాత్రం ఆమె బహిర్గతం చేయలేదు. 
 
సంధ్యారాణి ఆత్మహత్య తర్వాత పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సంధ్యారాణి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలు స్పష్టంగా పేర్కొంది. దీంతో ఈ కేసులో బెయిల్ వచ్చే వరకూ పోలీసులకు లొంగిపోకుండా పారిపోవాలని రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ పోలీసు అధికారి చెప్పారు. వారు చెప్పిన మాట వినే, లక్ష్మి దంపతులు గుంటూరును వీడి వెళ్లారని పోలీసు వర్గాలు విచారణలో తెలుసుకున్నాయి. ఇక గుంటూరును వీడిన ఈ దంపతులు 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో తిరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు.