రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు చేపట్టండి: సీపీఐ

గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:54 IST)
మే 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మౌన దీక్షలూ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. కరోనా లాక్‌డౌన్ కష్టాలు పేద, సామాన్య ప్రజానీకాన్ని, వలస కూలీలు, భవన నిర్మాణ, గ్రామీణ కార్మికుల్ని పలు ఇబ్బందులకు గురి చేశాయన్నారు.

లాక్ డౌన్ వల్ల నష్టపోయిన రైతులు, చిరు వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వలస కార్మికులందరినీ స్వస్థలాలకు చేర్చాలన్నారు.

ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం, 50 కేజీల గోధుమలు, రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ మే 4న అన్ని మౌన దీక్షలు చేపడుతున్నామని రామకృష్ణ వెల్లడించారు.

అన్నీ చూడండి

Satyadev :ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సమవర్తి నుంచి సత్యదేవ్ లుక్

Aadi: వసుదేవసుతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆది

అడిగి తీసుకుంటే భిక్ష - అడగకుండా ఇస్తే అసలైన విలువ : రాజేంద్ర ప్రసాద్

SS Rajamouli: వారణాసి అప్ డేట్ తో ఎం.ఎం. కీరవాణి పుట్టినరోజు వేడుక

Narne Nithin :నార్నే నితిన్, అనికా సురేంద్రన్, మేఘా శెట్టి కాంబినేషన్ లో చిత్రం

తర్వాతి కథనం
Show comments