రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు చేపట్టండి: సీపీఐ

గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:54 IST)
మే 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మౌన దీక్షలూ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. కరోనా లాక్‌డౌన్ కష్టాలు పేద, సామాన్య ప్రజానీకాన్ని, వలస కూలీలు, భవన నిర్మాణ, గ్రామీణ కార్మికుల్ని పలు ఇబ్బందులకు గురి చేశాయన్నారు.

లాక్ డౌన్ వల్ల నష్టపోయిన రైతులు, చిరు వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వలస కార్మికులందరినీ స్వస్థలాలకు చేర్చాలన్నారు.

ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం, 50 కేజీల గోధుమలు, రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ మే 4న అన్ని మౌన దీక్షలు చేపడుతున్నామని రామకృష్ణ వెల్లడించారు.

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments