కోస్తా వరకు ఉపరితలద్రోణి

సోమవారం, 14 అక్టోబరు 2019 (07:58 IST)
లక్షదీవుల ప్రాంతం నుంచి కోస్తా వరకు ఉపరితలద్రోణి ఆవరించింది. ఆగ్నేయ/దక్షిణ దిశ నుంచి కోస్తాపైకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. 
 
దీంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
కాగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ వేగవంతం కావడంతో రానున్న వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

అన్నీ చూడండి

Ali apology : నటుడు అలీ సోప్ యాడ్ వివాదంతో క్షమాపణ చెప్పాడు

Bunny Vas : మూడు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ మన చేతుల్లో లేదు : బన్నీవాస్

కన్నడ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత

Ramcharan: ముంబైలో పెద్ది ట్రైలర్, భోపాల్‌లో స్పెషల్ మ్యూజికల్ ఈవెంట్

Prabhas Update: స్పిరిట్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పోలీస్ సెట్‌లో షూట్ మొదలైంది

తర్వాతి కథనం
Show comments