రాజధాని భూసేకరణపై రైతులకు ఆందోళన వద్దు: యనమల
రాజధాని భూమిని సేకరించే విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళన వద్దని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ రాజధానికి భూమి సేకరించే విషయంలో వస్తున్న వదంతులను యనమల కొట్టిపారేశారు. ఏమైనా అపోహలు, ఆందోళనలు ఉంటే మంత్రివర్గం, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
ఈ మేరకు తన కార్యాలయంలో మీడియాతో యనమల మాట్లాడుతూ, రైతులకు లాభసాటిగా ఉండే విధంగానే భూసేకరణ పాలసీ తయారుచేశామని మంత్రి తెలిపారు. రాజకీయ లబ్దికోసం కొందరు ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని చెప్పారు.