వైఎస్సార్సీపీ నాయకుడి దారుణ హత్య: గన్తో కాల్చి..
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ గ్రామ సర్పంచ్ను సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
కణేకల్లు మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ను దుండగులు తుపాకీతో అతి సమీపం నుంచి కాల్చి చంపారు.
విశ్వనాథ్ కణేకల్లు వెళ్తుండగా దుండగులు మాల్యం వద్ద ఆయనపై మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్చి చంపారు.