1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (23:03 IST)

అనంతపురం జేఎన్‌టీయూలో ర్యాగింగ్‌: 18 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

ర్యాగింగ్ పలు కళాశాలల్లో, పాఠశాలల్లో భూతంగా మారింది. అనేక రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులను ర్యాంగింగ్ వేధిస్తూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌, అనంతపురంలోని JNTUలో జూనియర్‌లను ర్యాగింగ్ చేసినందుకు 18 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. 
 
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జెఎన్‌టియు)లోని కాలేజ్ అకడమిక్ కౌన్సిల్ (జెఎన్‌టియు) రెండో సంవత్సరం అనంతపురం ఇంజినీరింగ్ కాలేజీ ఫ్రెషర్‌లను ర్యాంగింగ్ చేసినట్లు తేలింది. 
 
కళాశాల అధికారులను విచారించగా, సీనియర్లు తమను ర్యాగింగ్ చేసినట్లు అంగీకరించారు. మరో ముగ్గురు సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.