1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. A young woman who poured petrol and set herself on fire when she was going to get married

పెళ్లి చేయబోతే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి

young woman
పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం ఆమెకి ఆగ్రహం తెప్పించింది. వెంటనే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. 
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని మృత్యుంజయపురం గ్రామానికి చెందిన 19 ఏళ్ల అశ్వని బీటెక్ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అంజయ్య, సీతయ్యలు నిర్ణయించారు. అందుకు ఆమె ససేమిరా అనడమే కాకుండా ఆగ్రహంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు చెప్పినట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి వెల్లడించారు.
తర్వాతి కథనం
పేదల పెన్నిది, మనసున్న మహరాజు సోనూసూద్, అదంతా ఆయన నిర్ణయమేనంటున్న రియల్ హీరో