1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (12:31 IST)

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు : ఏసీబీ కస్టడీకి ఏసీపీ!

acp umamaheswara rao
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన ఏసీపీ ఉమామహేశ్వర రావును విచారణ నిమిత్తం అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో కస్టడి పిటిషన్ దాఖలు చేయగా, దానిపై విచారణ జరిపిన కోర్టు.. మూడు రోజుల పాటు కష్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, ఏసీబీ పది రోజుల పాటు కస్టడీ కోరగా మూడు రోజులు మాత్రమే కస్టడీకి  అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ నెల 22వ తేదీన ఏసీపీ ఉమామహేశ్వర రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.3.95 కోల్ విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఏసీపీని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా జైలు నుంచి ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.